BIG UPDATE On Indiramma Houses | త్వరలో 71వేల ఇందిరమ్మ ఇళ్ళు | CM Revanth Reddy | Congress | RTV
తెలంగాణలోని నల్గొండలో వింత ఘటన చోటుచేసుకుంది. గతేడాది తప్పిపోయిన తన పిల్లి పక్కింట్లో ఉందని ఓ మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన పిల్లి తెల్లగా ఉంటుందని, దానికి బ్రౌన్ కలర్ వేశారని తెలిపింది. పోలీసులు ఈ సమస్య తేల్చలేక ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
తెలంగాణలో కొత్త వైరస్ కలకలం రేపింది. కుక్కల నుంచి మనుషులకు సోకే ‘బ్రూసెల్లా ఇథిపికల్’ వైరస్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బయటపడింది. కనగర్తికి చెందిన 4ఏళ్ల చిన్నారి చేపూరి శ్రీమేధ ఈ వైరస్ బారిన పడి హాస్పిటల్లో చికిత్స పోందుతోంది.