JP Nadda: వచ్చేసారి తెలంగాణలో బీజేపీదే అధికారం: జేపీ నడ్డా
తెలంగాణలో ఓటింగ్ శాతం 7.1 నుంచి 14 శాతానికి పెరిగిందని బీజేపీ జాతీయ మండలి సమావేశంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ భారత్లో కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగైన స్థితిలో ఉందన్నారు.