Telangana: తెలంగాణ ప్రభుత్వ విప్ల నియామకం.. అందరూ కొత్త ఎమ్మెల్యేలే..!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నలుగురు ప్రభుత్వ విప్లను నియమించింది. ఎమ్మెల్యేలు రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లను విప్లుగా నియమించారు. వీరంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే కావడం విశేషం.