Uddhav Thackeray: గోద్రా లాంటి ఘటనలు జరిగే అవకాశం.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశం నలమూలాల నుంచి బస్సులు, ట్రక్కులలో రామాలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉందన్నారు.