Shikhar Dhawan: ఢిల్లీ కోర్టులో శిఖర్ ధావన్కు భారీ ఊరట.. అయేషా ముఖర్జీతో విడాకుల కేసు!
క్రికెటర్ శిఖర్ ధావన్ను భార్య అయేషా ముఖర్జీ మానసిక హింసకు గురి చేసిందని కోర్టు తేల్చింది. ధావన్ ఆరోపణలను సమర్థిస్తూ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ధావన్ తన విడాకుల పిటిషన్లో తన భార్యపై చేసిన అన్ని ఆరోపణలను న్యాయమూర్తి హరీష్ కుమార్ అంగీకరించారు. ఎందుకంటే అయేషా ఈ ఆరోపణలను వ్యతిరేకించలేదు. తనను తాను సమర్థించుకోవడంలో విఫలమైంది.