Sandeep: మ్యాట్రీమోనీలో భారీ మోసం.. ఐఏఎస్నంటూ రూ.2 కోట్ల కట్నం దోచేసి దారుణం!
ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమోతు సందీప్ అనే వ్యక్తి ఐఏఎస్నని నమ్మించి మ్యాట్రిమోని ద్వారా ఆదోనికి చెందిన శ్రావణిని పెళ్లి చేసుకుని రూ.2 కోట్లు కొట్టేశాడు. అంతటితో ఆగకుండా అదనపు కట్నం కోసం వేధించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడి ఫ్యామిలీని పోలీసులు అరెస్ట్ చేశారు.