Suicide: ఇంకా ఎన్ని చూడాలి.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఏడాది జనవరిలో ఇది రెండో ఆత్మహత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. జేఈఈ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న నిహారిక(18) అనే అమ్మాయి తాను జేఈఈ చేయలేనంటూ సూసైడ్ నోట్ రాసి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.