ఏపీలో 3 రోజుల పాటు వానలే వానలు | Cyclone Alert In Andhra Pradesh | RTV
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ-తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ(IMD). రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్పై వానదేవుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగులో కూరగాయల వ్యాపారి షేక్ మహ్మద్ ఖాసీం నీట మునిగి మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కరిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న అల్పపీడన ద్రోణి కోస్తా భాగాలపై కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని వలన దక్షిణ కోస్తా ఏపీలోనూ బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు.