Rath Yatra: పూరీ జగన్నాధ యాత్రలో అపశ్రుతి.. విగ్రహం కిందపడి ఏడుగురికి గాయాలు
పూరీలో రథయాత్ర అనంతరం మంగళవారం బలభద్ర విగ్రహం పడిపోవడంతో ఏడుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. మూడు దేవతా విగ్రహాలను రథంపై నుంచి గుండిచా ఆలయంలోని అడపా మండపానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.