కుక్క కరిస్తే ప్రభుత్వానికి రూ.10వేల ఫైన్.. పంజాబ్-హరియాణా హైకోర్టు సంచలన తీర్పు
వీధి కుక్కల దాడి కేసులో పంజాబ్-హరియాణా హైకోర్టు మంగళవారం ఆసక్తికరమైన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో కుక్క, ఇతర జంతువులు కరిస్తే ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.