Khammam: ఖమ్మం బరిలో దిగేదెవరు? పువ్వాడకు పోటీ ఇచ్చే నాయకులు లేరా?
పోరాటాల పురిటి గడ్డ అయిన ఖమ్మం ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి నియోజకవర్గం నుంచి గత రెండు దఫాలుగా సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.