BREAKING: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. దేశ ప్రజలకు మోదీ గుడ్న్యూస్!
ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.75వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నామని.. కోటి గృహాలకు లబ్ది చేకూరేలా చేస్తామన్నారు.