Pending Cases: దేశంలో 5 కోట్ల పెండింగ్ కేసులు
దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యూపీలో అత్యధికంగా 1.18 కోట్ల కేసులు, సుప్రీంకోర్టులో 84,045 కేసులు, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.