ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన అఘోరీ | Agori Enters to Andhra pradesh | Visakhapatnam | RTV
హైదరాబాద్ లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారనేది పూర్తిగా అబద్దమని నగర పోలీసులు తెలిపారు. నగరంలో దుకాణాలు, సంస్థలు తెరవడం, మూసివేసే టైమింగ్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.నగర వాసులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు పేర్కొన్నారు.
వేసవి సెలవులు ముగిశాయి. పిల్లల ఆటపాటలకు చెక్ పడనుంది. రేపటి నుంచి బడులు ఓపెన్ అవనున్నాయి. తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ, ప్రవైటు స్కూళ్ళల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
స్టార్ నటి తాప్సీ పన్నూ తన ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ గురించి ఓపెన్ అయింది. తొమ్మిదో తరగతిలో సీనియర్ అబ్బాయితో ప్రేమలో పడ్డానని చెప్పింది. కానీ చదువు డిస్ట్రబ్ అవుతుందని అతను కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పాడని, ప్రేమ, ఆకర్షణకు తేడా తెలియక తాను చాలా రోజులు బాధ పడ్డానని తెలిపింది.
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని గురువారం సాయంత్ర 5 గంటలకు తెరవబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. మండల పూజ సీజన్ సందర్భంగా రెండు నెలల పాటు ఆ ఆలయాన్ని తెరచి ఉంచనుండగా కొత్త పూజారిగా పీఎన్ మహేశ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఇంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రకటించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా వ్యవహరించడం కేసీఆర్కు అలవాటైందన్నారు.