Telangana: ఆధ్యాత్మిక పర్యాటకానికి బడ్జెట్లో పెద్ద పీట..టెంపుల్ టూరిస్ట్ హబ్గా తెలంగాణ!
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నాను..బడ్జెట్ అంటే ఏదో ఊహించేసుకుని ఎంతో డ్రామా సృష్టిస్తున్నాం.అభివృద్ది కోసం చేసే ప్రకటనలకు కేవలం బడ్జెట్ ఒక్కటే సందర్భం కాదు అన్నారు.
ఈరోజు ఉదయం పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 57 నిమిషాలపాటూ ఈ ప్రసంగం సాగింది. అయితే ఇప్పటివరకు నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఇదే అతి చిన్నది. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరవసారి.
సొంత ఇళ్ళ కోసం కలలు కంటున్నవారికి శుభవార్త చెప్పారు ఆర్ధిక మంత్రి. ఇంటి నిర్మాణం, కొనుగోలుకు ప్రభుత్వం మద్దుతు ఇస్తుందని చెప్పారు. బస్తీలు, ఆద్దె ఇళ్ళల్లో ఉన్నవారి సొంత ఇంటికలను నెరవేరుస్తామని అన్నారు. ఆవాస్ యోజనా కింద మరో 2కోట్ల ఇళ్ళు నిర్మిస్తామని తెలిపారు.
ప్రపంచంలోనే కోటి ఇళ్లకు కొత్తగా సోలార్ పథకం అమలు చేస్తామని చెబుతున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని తెలిపారు. ఈ సారి బడ్జెట్లో ఇదొక కొత్త పథకం కింద ఆమె ప్రవేశపెట్టారు.
పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను చదువుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేసిందని..పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేశామని చెప్పారు.
స్టాలిన్ ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రామభక్తులను బెదిరిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. రామ్లల్లా పట్టాభిషేకం ప్రత్యక్ష ప్రసారం చేయడంపై నిషేధం విధించిందన్నారు. కేంద్ర మంత్రి ఆరోపణలు నిరాధారమైనవని డీఎంకే పేర్కొంది.