ఇసుక విధానంలో లోటుపాట్లు సరిచేస్తాం
AP: పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ ఐదేళ్ల విధ్వంసం ఆస్పత్రి నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని అన్నారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఐదేళ్లైనా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు.
పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ తో పాటు మంత్రి పదవి దక్కించుకున్నారు. తండ్రి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.