Chandrayaan-3: ఆ ప్రాంతానికి 'శివశక్తి', పాదముద్రను వదిలిన ప్రదేశానికి 'తిరంగా' అని నామకరణం..!!
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకుని బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని సక్సెస్ చేసి భారత సత్తా ఏంటో చూపించిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. శనివారం ఉదయం బెంగుళూరులోని హాల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు నేరుగా బెంగుళూరు వచ్చానని మోదీ అన్నారు.