ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన దసరా
సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 30 లక్షలు విలువ చేసే 35.4 తులాల బంగారు, 10 తులాల సిల్వర్ ఆభరణాలు, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న లారీ వెనకనుంచి ఓ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సెలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఇప్పటివరకు చైర్మన్ గా పని చేసిన మందడి సైదిరెడ్డి తన పదవిని కోల్పోయారు. నల్గొండ కొత్త మున్సిపల్ చైర్మన్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.
నల్గొండ జిల్లా దేవరకొండలో లాకప్ డెత్ జరగడం కలకలం రేపింది. ఓ భూవివాదం కేసులో అరెస్టైన సూర్య నాయక్ అనే నిందితుడ్ని ఎస్సై సతీష్ రెడ్డి చితకబాదాడంతోనే మృతి చెందాడని.. సూర్య నాయక్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని అన్నారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన మొక్కు నేటితో తీరిపోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తన గడ్డం తీసేసే సమయం వచ్చిందని పేర్కొన్నారు.