Nagam Janardhan Reddy Meet AP CM Chandrababu Naidu | నాగం గారు బాగున్నారా? | RTV
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో నాగం సొంత గూటికి చేరుతారా? అన్న చర్చ మొదలైంది. అయితే.. వీరి మధ్య అలాంటి అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది.
నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. త్వరలోనే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి, మంచి ముహూర్తం చూసుకుని గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పారు. కాగా, నాగం జనార్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు.
55 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్ హైకమాండ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, గీతారెడ్డి తదితర మాజీ మంత్రుల పేర్లను ప్రకటించలేదు. ఇంకా కొండా సురేఖ, మధు యాష్కిల పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేవు.
కేసీఆర్పై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్కు అవగాహన లేదన్నారు. ఒక్క ప్రాజెక్టు కోసం రెండు మూడు సార్లు టెండర్లను ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు.