Flight: విమానంలో ఏసీ ఆఫ్...సాంకేతిక లోపంతో 5 గంటల పాటు లోపలే ప్రయాణికులు.. పలువురికి తీవ్ర అస్వస్థత!
ముంబయి నుంచి మారిషస్ వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సుమారు 5 గంటల పాటు విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. అంతేకాకుండా విమానంలో ఏసీ పనిచేయక పోవడంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 78 ఏళ్ల వృద్దుడు, చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.