తిరుపతిలో మరోసారి చిరుత అటాక్.. || Leopard Attack In Tirupati || Tirumala || RTV
తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచరిస్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు దీపక్ టీటీడీ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అలపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి. దీంతో వాటిని చూసిన భక్తులు భయంతో హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
ఓ వైపు చిరుతలు.. మరోవైపు ఎలుగుబంటి హల్ చల్.. కొండపైకి వెళ్లాలంటేనే ప్రాణాలకు తెగించి వెళ్లాలి. లేదంటే ప్రాణాలు వన్య మృగాల చేతిలో బలి అవ్వాల్సిందే.. దేవుని దర్శనం కావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే అంటున్నారు భక్తులు. . ఇది తిరుమలలో కొనసాగుతున్న పరిస్థితి.