MP: కూనో నేషనల్ పార్కులో మగ చిరుత మృతి..ఇప్పటి వరకు పది...!!
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో మరో చిరుత మృతి చెందింది. నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చిరుత 'శౌర్య' ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు పది చీతాలు మరణించాయి. చిరుత మృతికి గల కారణాలను పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వెల్లడిస్తామని పార్కు నిర్వహకులు తెలిపారు.