Rishab Shetty : దేశం పరువు తీస్తున్నారు.. బాలీవుడ్పై కాంతార హీరో సంచలన వ్యాఖ్యలు!
కన్నడ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని బాలీవుడ్ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనను విమర్శిస్తున్నారు. గతంలో అయన నటించిన సినిమాల సన్నివేశాలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.