AP : నేడే వారాహి విజయభేరి మోగించనున్న పవన్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పిఠాపురంలోనే బస చేయనున్నారు. పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పిఠాపురంలోనే బస చేయనున్నారు. పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతో కలిసి పనిచెస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. బిజెపి కలిసి వస్తుందని పవన్ చెప్పారన్నారు. మచిలీపట్నం టీడీపీ నేతలతో పవన్ సమావేశామయ్యారు. అంచలంచలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని అటు పవన్కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.
2008లో రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మొగ్గలోనే తుంచేశారని పవన్ అభిప్రాయపడ్డారు. మనవారే మనకి వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు ప్రభుత్వం జనసేన మీద దాడులు చేయడానికి ఎందుకు ఆలోచిస్తుంది అంటే మనది పోరాట బలమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గొప్ప ఆత్మబలం ఉన్న రాజకీయ శక్తి జనసేన పార్టీని చెప్పారు. డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను... సినిమాలు సమీప భవిష్యత్ లో ఆపేస్తానని పవన్ తెలిపారు.
ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా అనేది తనకు సందేహమేనన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలెయన్స్లో వెళితే మనకి బలమైన సీట్లు వస్తాయని మచిలీపట్నంలో టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బలమైన పాదముద్ర ఉండబోతుందని.. జనసేన ,టీడపీ ఎదుగుతాయిన్నారు. భవిష్యత్లో అవనిగడ్డ, మచిలీపట్నం , పెడన , కైకలూరుని చతుర్ముక నగరంగా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రేపటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది.