AP Govt Jobs: ఏపీలో భారీగా పెరిగిన గ్రూప్-2 జాబ్స్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..!!
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. గ్రూపు-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ సర్కార్ జీవోను విడుదల చేసింది. గతంలో గ్రూప్ -2లో 508పోస్టుల భర్తీకి సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలన అనంతరం 212 పోస్టుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.