IND VS SA: ఫేర్వెల్ సిరీస్లో సెంచరీ.. సెల్యూట్ చేసిన కోహ్లీ.. రెండో రోజు ఆటలో ఏం జరిగిందంటే?
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు-రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. 11 పరుగుల లీడ్లో ఉంది. క్రీజులో సెంచరీ హీరో ఎల్గర్ ఉన్నాడు.