IIT Delhi : విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు ఐఐటీ ఢిల్లీ కీలక నిర్ణయం..!!
ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీల్లో చదవుకునే విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత సమస్యలతోపాటు..చదవులు, పరీక్షల్లో ఒత్తిడి కలగం వల్లే ఇలా సుసైడ్ చేసుకుంటున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిగణలోనికి తీసుకుని..వాళ్లపై భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోనుంది.