IND VS AUS: స్వింగ్ మాములుగా లేదు బాసూ.. ఆసీస్ను కంగారెత్తిస్తోన్న బుమ్రా, షమీ!
ఆస్ట్రేలియా, టీమిండియా ఫైనల్ రసవత్తరంగా మారింది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 16ఓవర్లు ముగిసే సమమానికి 87 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
ఆస్ట్రేలియా, టీమిండియా ఫైనల్ రసవత్తరంగా మారింది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 16ఓవర్లు ముగిసే సమమానికి 87 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
మోదీ స్టేడియంలో జరుగుతున్న వన్డే ప్రపంచ్కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్ ధరించిన జాన్ అనే ఆస్ట్రేలియన్ పిచ్ మధ్యలోకి దూసుకొచ్చాడు. కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. అతడిని అహ్మదాబాద్లోని చంద్ఖేడా పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆస్ట్రేలియాపై జరుగుతున్న ఫైనల్ పోరులో కోహ్లీ 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ వరల్డ్కప్లో కోహ్లీ 750కు పైగా పరుగులు చేశాడు. సెమీస్లో సెంచరీ చేసిన కోహ్లీ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా స్లోగా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో బౌండరీ రావడమే గగనమైపోయింది. స్టేడియంలో లక్షా 30వేల మంది సైలెంట్గా ఉండిపోయారు. లక్షల మందిని సైలెన్స్గా ఉంచితే అంతకంటే వచ్చే సంతృప్తి అసలు ఉండదు అన్న కమ్మిన్స్ మాటలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
వరల్డ్కప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మ సత్తా చాటాడు. తన స్ట్రాటజీని పక్కాగా అమలు చేశాడు. 31 బంతుల్లో 47 రన్స్ చేసిన రోహిత్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో హెడ్ అద్భుతమైన క్యాచ్కు వెనుతిరిగాడు.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫైనల్ ఫైట్లో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గిల్ నాలుగు పరుగులకే ఔట్ అవ్వగా.. రోహిత్ దూకుడుగా ఆడుతున్నాడు. ఇక మ్యాచ్కు ముందు మోదీ స్టేడియంలోని లక్షా 30 వేల మంది జాతీయ గీతాన్ని అలపించారు.
అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న వన్డే క్రికెట్కప్ ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు వరల్డ్కప్ల్లో 13సార్లు తలపడ్డాయి. అందులో 8సార్లు ఆస్ట్రేలియా గెలవగా.. 5సార్లు ఇండియా గెలిచింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాట్ జరగనుంది. మ్యాచ్ను వీక్షించేందుకు ఇప్పటికే భారీగా అభిమానులు స్టేడియంకు చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం వద్ద రద్దీ వాతావరణం నెలకొంది.