Keesara: మానవత్వం మంటగలిసింది.. కాపాడండి బాబూ అంటున్నా కనికరించలేదు!
హైదరాబాద్లోని కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఏలేందర్ (35)ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏలేందర్ రెండుకాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఆసుపత్రికి తరలించండి అంటూ బాధితుడు ప్రాధేయపడినా చుట్టూ ఉండేవారు చూస్తూ ఉండిపోవడంతో ప్రాణాలు విడిచాడు.