Telangana Elections: నన్ను చంపేందుకే దాడి చేశారు.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు
తనపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కాంగ్రెస్ నేత వంశీకృష్ణ అతని అనుచరులతో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో కూడా వంశీకృష్ణ ఇలానే దాడి చేయించారని అన్నారు. రాజకీయాల్లో పగలు, ప్రతీకారాలు మన సంస్కృతి కాదు అని తెలిపారు.