Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ లోని కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రైతులకు రైతు భారోసాను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సహాయం అందుతుంది. 1,46,324 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు దారులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పంట హక్కు పత్రాలు పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.7,500 జమ కానున్నాయి.