గన్నవరంలో వేడెక్కిన రాజకీయం.. దుట్టా.. యార్లగడ్డ వైపు వెళ్తారా? వంశీకి సపోర్ట్ చేస్తారా?
గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా యార్లగడ్డ నియామకంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం కొత్త గేమ్ మొదలుపెట్టింది.