ఐదేళ్లలో నక్సలిజాన్ని ఖతం చేస్తాం.. అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి నక్సలిజంపై సంచలన కామెంట్స్ చేశారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలోగా నక్సలిజం ఆనవాళ్లు లేకుండా అంతమొందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం బాఘేల్ సర్కారు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు.