CM Revanth Reddy: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
ధరణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్లో 2.45 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు.