Andhra Pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఇంటర్న్షిప్ ప్రారంభం..
ఏపీలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు దీర్ఘకాలిక ఇంటర్న్షిప్ ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్షిప్ ప్రారంభం కానుండగా.. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో మొదలవుతుంది. ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇది చేసేందుకు సిద్ధమవుతున్నారు.