Team India: కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్లేయర్ ఇతనే!
టీ20ల పరంగా ఈ ఏడాది ఎక్కువగా డబ్బులు సంపాదించిన ప్లేయర్గా పేసర్ అర్ష్దీప్ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్కొ మ్యాచ్కు బీసీసీఐ రూ.3లక్షల మ్యాచ్ ఫీజ్ చెల్లిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 టీ20లు ఆడిన అర్ష్దీప్ రూ.57లక్షలు సంపాదించాడు.