లోయలోకి దూసుకు వెళ్లిన బస్సు....8 మంది మృతి...27 మందికి గాయాలు...!
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వున్నట్టు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.