CM KCR: గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్ వేయనున్నారు గులాబీ బాస్.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్ వేయనున్నారు గులాబీ బాస్.
నవంబర్ 10తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజే ఈ రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కేసీఆర్ ఇవాళ(నవంబర్ 9) రెండు స్థానాలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 -12 గంటల మధ్య గజ్వేల్లో నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ సమర్పించనున్నారు.
ఎన్నికల వేళ సోషల్మీడియా ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. సోషల్మీడియాలో ఇటీవల ఎక్కడ చూసినా 'గులాబీల జెండలే' పాటే వినిపిస్తోంది. సినీ సెలబ్రెటీలతో పాటు పొలిటికల్ ఎనలిస్టులతో కేటీఆర్ అవుతున్న వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం కేసీఆర్. సింగరేణిలో 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్ అంటూ ధ్వజమెతతారు. 58 ఏళ్లు గోస పెట్టిన కాంగ్రెస్ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 50కు పైగా స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్, NCP ఓట్లు చీల్చే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజేయుడికి బీఆర్ఎస్ బీఫామ్ అందించారు సీఎం కేసీఆర్.
నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి నందకుమార్ వ్యాస్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.
దేశంలో ఎక్కడాలేని విధంగా 24గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు వద్దు, 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వెయ్యాలో ఆలోచించాలని కోరారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.