Asaduddin Owaisi: శాంతి భద్రత విషయంలో తెలంగాణ భేష్
ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు.
ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసన ఆమె.. కేసీఆర్ పేరుకే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, కేసీఆర్ మాత్రం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు.
నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న కోనేరు చిన్ని అలియాస్ సత్యనారాయణ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్న సీఎం కేసీఆర్. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కోనేరు చిన్ని. 3 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. భారీ ర్యాలీగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న కోనేరు చిన్ని. ముఖ్య అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో కోనేరు చిన్ని చేరనున్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లోకి కోనేరు చిన్ని.
ఎమ్మెల్సీ కవితపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇస్తే కవిత హై కోర్టుకు వెళ్లిందన్న ఆయన.. కవిత చెప్పిన విషయాన్పి కోర్టు ఎలా నమ్మిందన్నారు.
సీఎం కేసీఆర్పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ 22 శాతానికి తగ్గించాడని మండిపడ్డారు.
గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పరకాలలో బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ తలరాతలు మారుతాయని తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు.
సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయన్నారు.
విద్యార్థులకు మంచి బోధనతో పాటు.. ఆరోగ్యకరమైన పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. అలాగే, ఈ పథకం ద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం.