Chandrababu naidu: బావ బామ్మర్దిలిద్దరినీ అరెస్ట్ చేసింది ఒకే అధికారి!
అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసింది సంజయ్ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.
అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసింది సంజయ్ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి కేసులో ఏసీపీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఇప్పటికే సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో రూ.18 కోట్లు వుంటే ఇప్పుడది ఏకంగా రూ.600 కోట్లు వరకూ ఉంటుందని సీఐడీ కోర్టుకు తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలని కోర్టుకు తెలిపిన సీఐడీ.. వారి స్టేట్ మెంట్ లను కూడా సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేసింది.