China Virus 🔴LIVE : మళ్ళీ కొత్త వైరస్.. లక్షల్లో కేసులు | Another New Virus Outbreak In China | RTV
ఇటీవలె తజికిస్తాన్ లో చైనా సైనిక స్థావర ఫోటోలు బయటకి వచ్చాయి. చైనా కావాలనే భారత్ పై రహస్య గూఢాచార్యం చేసేందుకే పాక్,శ్రీలంక దేశాలకు రుణాలు ఇచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుందని గతంలో విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. తాజాగా ఈ ఉదంతం తజికిస్తాన్ లో కూడా వెలుగుచూసింది.
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఓ రహదారిలో కొంత భాగం కుప్పుకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
2023లో చైనా జనాభా 20లక్షలు క్షీణించింది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న తక్కువ జననాల సమస్యతోపాటు గతేడాది మరణాలు అధికం సంభవించాయి. దీంతో జనాభా భారీగా పడిపోయింది. వ్రుద్ధుల జనాభా క్రమంగా పెరగడం..పనిచేసే సామర్థ్యం ఉన్న జనాభా తగ్గుతోంది.
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మని, భారత్తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య 100 పెరిగినట్లు సమాచారం. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్హెడ్లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030కి 1000కి చేరే అవకాశం ఉండనున్నట్లు పెంటగాన్ వెల్లడించింది.