ఏం పీక్కుం*టావో పీక్కో పొంగులేటిపై కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ కుటుంబ కథా చిత్రం నడుస్తోందన్నారు. త్వరలోనే రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి అమృత్ టెండర్ల కుంభకోణం బయటపెడతానని చెప్పారు.
వాల్మీకి స్కామ్పై కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. గతంలో తాము చెప్పినట్టుగానే వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్సభ ఎన్నికల్లో వాడిందని ఆరోపించారు.
కవిత బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు కేటీఆర్ హడావుడిగా సుప్రీం కోర్టు నుంచి తిహార్ జైలుకు బయల్దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు తన కారు దిగి ప్యాసింజర్ ఆటో ఎక్కారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్లో తెలంగాణ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.. లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణలోని 9మందికి మద్యం, డబ్బు పంచడం కోసం రూ.90 కోట్లు అందాయని ఈడీ, సిట్ విచారణలో ప్రాథమికంగా తేలిందని చెప్పారు.
TG: మహిళా కమిషన్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విచారణకు హాజరైన కేటీఆర్ను కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకున్నారు. మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. ఇటీవల మహిళలపై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.