పాక్ జోలికొస్తే.. యుద్ధ రంగంలోకి బంగ్లాదేశ్ | Bangladesh Strong Warning To India Over Pak War | RTV
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపడానికి ఐక్యరాజ్యసమితి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ అమెరికాలో భారతీయ హిందువులు నిరసన వ్యక్తం చేశారు. దక్షిణాసియాలో శాంతిభద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు. హ్యూస్టన్ షుగర్ ల్యాండ్ సిటీ హాల్లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్లలో లక్షలాది మంది హిందువులు శనివారం ప్రదర్శనలు నిర్వహించారు. కొందరు ముస్లింలు కూడా వారికి సంఘీభావంగా నిరసన వ్యక్తం చేశారు. చిట్టగాంగ్లో దాదాపు 7 లక్షల మంది ఆందోళన చేసినట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కొత్త ప్రభుత్వానికి నేతృత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.
బంగ్లాదేశ్ లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో భారత్ వచ్చిన ప్రధాని షేక్ హసీనా విమానం తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. అయితే, షేక్ హసీనా మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఆమె లండన్ లేదా ఫిన్లాండ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షోర్గంజ్ అనే జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును సరకు రవాణా రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులను పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫైర్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు.