నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి....!
మిజోరాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఐజ్వాల్ కు సమీపంలో సాయిరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఒక్క సారిగా కూలి పోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.