నకిలీ వేలిముద్రలు తయారీ.. ఆరుగురి అరెస్టు
నకిలీ వేలిముద్రలు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు నిందితుల నుంచి నకిలీ వేలిముద్రలతో పాటు వాళ్లు కాజేసిన రూ.10లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఆధార్ ఎనేబుల్డ్ సిస్టం ద్వారా వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బు స్వాహా చేసినట్లు గుర్తించారు.