Big Breaking: హైకోర్టు కీలక ఆదేశాలు.. లోకేష్ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా!
నారా లోకేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. దీంతో సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నారా లోకేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. దీంతో సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజధాని అమరావతి అసైన్ భూముల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాలు పొడిగించింది ఏపీ హైకోర్టు. నారాయణ దాఖలు చేసిన మరో నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్ల విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్, క్వాష్ పిటిషన్ వాయిదా పడ్డాయి. అసైన్ ల్యాండ్స్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్లను సైతం వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేష్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ దాఖలు చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టులో టీడీపీ యువనేత నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో లోకేష్ను ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే.
ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుని సీఐడీ కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు.
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మళ్ళీ దెబ్బ పడింది. క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిని సెప్టెంబర్ 19వ తేదీకి ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. మరోవైపు ఈ నెల 18 వరకు సీఐడీ పిటిషన్ వేసిన కస్టడీ పిటిషన్స్ మీద కూడా ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది.