AP: మా గ్రామాలకు దారేది.. రోడ్డెక్కిన పసిపిల్లలు, పెద్దలు
మా గ్రామాలకు దారేదని అనంతపురం జిల్లా గుర్రపుకొండ ఎగువతాండ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులతో పిల్లలతో రోడ్డుపై బైఠాయించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు సమస్యపై పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విసుగెత్తి రోడ్డుపై ధర్నాకు వచ్చామంటున్నారు.