కొత్తగూడెంలో హైటెన్షన్.. ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య వాగ్వాదం
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సాంబశివరావును ప్రధాన కార్యాలయంలోకి అనుమతించపోవడంతో ఏఐటీయూసీ కార్మికులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు.