ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.... లారీని ఢీ కొట్టిన బస్సు..... 30 మందికి గాయాలు..!
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొయ్యల గూడెం పులివాగు శివాలయం వద్ద ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ఒకటి లారీని ఢీ కొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డి గూడెం నుంచి వాడపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికుులు ఉన్నారు.