Vijayanagaram: ఏపీలో దారుణం.. వాగులో కొట్టుకుపోయిన టీచర్లు!
ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు కొండ వాగులో కొట్టుకుపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన మహేష్, ఆర్తి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ కొండవాగులో కొట్టుకుపోయారు. ఆర్తి చనిపోగా మహేష్ గల్లంతయ్యారు. వాగు దాటొద్దని చెప్పినా వినలేదని స్థానికులు తెలిపారు.